అన్యాయానికి గురవుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకుల కోసం పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ను లాంచ్ చేశారని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అన్నారు. శుక్రవారం అట్లూరు మండలం కేంద్రంలో డిజిటల్ బుక్ క్యూర్ కోడ్ పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగి పోయాయన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారని, ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమస్యతో పాటు ఇబ్బంది పెట్టిన వారి వివరాలు, ఫొటోలు, సమాచారం నమోదు చేయాలని సూచించారు. ఈ వివరాలు నేరుగా అధినేత వైయస్ జగన్ దృష్టికి వెళ్తాయని, ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిన వారితో కలసి తిరగడం బాలకృష్ణకు సిగ్గుగా లేదా అని నిలదీశారు. తండ్రి పార్టీని లాక్కున్నా వాటి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి బాలకృష్ణది కాదన్నారు. ఆయనకు ఏ సర్టిఫికెట్లు ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. డాక్టర్ వైయస్ఆర్ రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని, ఆయన చలువతో లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అనేక రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహానేత తనయుడు వైయస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇళ్ల వద్దకే పథకాలు అందించారన్నారు. జగనన్నకు అందరూ తోడుగా ఉండాలన్నారు. కార్యక్రమం లో బూత్ కన్వీనర్ల నియోజక వర్గం అధ్యక్షుడు రమణా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు బాల ముని రెడ్డి, మల్లికార్జున రెడ్డి,పెద్ద పోలి రెడ్డి, మాధవ రెడ్డి, జిల్లా కార్యదర్శి బ్రహ్మ నంద రెడ్డి, భాస్కర్ రెడ్డి, నరసా రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa