ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 02:16 PM

2024 ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సెల్‌ఫోన్లు చూసుకొండి డబ్బులు వచ్చాయా.. చూసుకున్నారా.. కన్పర్మేషన్ మెసేజేలు అందుకున్నారా.. అని సీఎం ఆటో డ్రైవర్‌లని అడిగారు. అవును రూ.15 వేలు వచ్చాయని ఆటోడ్రైవర్‌లు సీఎంకు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్‌లు, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చేనాటికి వ్యవస్థలన్నీ అగమ్యగోచరమని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa