AP: ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద రాష్ట్రానికి 25 లక్షల అదనపు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి సౌరబ్గౌర్ వెల్లడించారు. పీఎంయూవై అమలు, పర్యవేక్షణకు జిల్లా ఉజ్వల కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. దీపం-2 పథకంతో పాటు పీఎంయూవై అమలు కోసం కలెక్టర్లు లేదా వారు నియమించిన సీనియర్ అధికారి ఛైర్మన్గా, నోడల్ అధికారి కో-ఆర్డినేటర్గా, నలుగురు సభ్యులను ఈ కమిటీలో చోటు కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa