ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడిని ఖండించిన వెంకయ్య నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 04:14 PM

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడి యత్నాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఖండించారు. దాడికి ప్రయత్నం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఛీఫ్ జస్టిస్‌కి సంబంధించిన అంశం కాదు, సమాజానికి, వ్యవస్థకి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు పార్టీ మారితే.. ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి రాజీనామా చేయాలని వెంకయ్యనాయుడు తెలిపారు. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ మారి మంత్రులు అవుతున్నారని ఆరోపించారు. చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహారించకూడదని సూచించారు. ప్రజలకి అందించే ఉచితాలు పరిధులు దాటుతున్నాయని వివరించారు. ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు అప్పులు తెచ్చేటప్పుడు, ఎలా తీరుస్తారో ప్రణాళికలు అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa