ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ర్యాలీ తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలని పరామర్శించిన విజయ్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 07, 2025, 05:03 PM

తమిళనాడులోని కరూర్ లో టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. గత నెల 27న జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన విజయ్.. దుర్ఘటన వెనక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని టీవీకే తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను విజయ్ పరామర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ తాజాగా స్పందించారు. మృతుల కుటుంబాలతో ఆయన వీడియో కాల్ లో మాట్లాడారు. ఈరోజు ఉదయం బాధిత కుటుంబాలకు విజయ్ ఫోన్ చేశారు. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చారు. త్వరలోనే వచ్చి వారిని కలుస్తానని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున, వ్యక్తిగతంగా కూడా వారికి అండగా ఉంటానని విజయ్ పేర్కొన్నారు. తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని త్వరలోనే పరామర్శిస్తానని విజయ్ చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ టీవీకే పార్టీ తరఫున విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa