సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని న్యాయవాది రాకేశ్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని ఓ విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన పిటిషన్పై సీజేఐ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు.సెప్టెంబర్ 16న మధ్యప్రదేశ్లోని జవారీలో ఉన్న ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణపై సీజేఐ ముందు పిటిషన్ విచారణకు వచ్చిందని రాకేశ్ కిశోర్ గుర్తుచేశారు. ఆ సమయంలో "వెళ్లి మీ దేవుడినే ఏదైనా చేయమని అడగండి" అంటూ సీజేఐ వ్యాఖ్యానించడం తనను కలచివేసిందన్నారు. "న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ, నమ్మకాలను ఎగతాళి చేయకూడదు. పిటిషన్ను తిరస్కరించడం అన్యాయం" అని ఆయన పేర్కొన్నారు. తాను హింసకు వ్యతిరేకినని, అయితే ఒక సాధారణ పౌరుడు ఎందుకిలా చేశాడో ఆలోచించాలని అన్నారు. "నేను ఏ మత్తులోనూ లేను. ఆయన చర్యకు ఇది నా ప్రతిస్పందన మాత్రమే. నాకు భయం లేదు, పశ్చాత్తాపం లేదు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఈ పని దేవుడే చేయించాడు. నన్ను జైలుకు పంపినా, ఉరితీసినా అది ఆయన చిత్తమే" అని రాకేశ్ కిశోర్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం, గుర్తింపు ప్రమాదంలో ఉన్నాయని, ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa