FASTag Annual Pass: దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్తగా 'FASTag వార్షిక పాస్' అనే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రారంభమైన కొద్ది కాలంలోనే సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు ఈ పాస్ను కొనుగోలు చేసి ఒక రికార్డు నెలకొల్పారు.అయితే, మరోవైపు నాన్-FASTag వాహనాలపై టోల్ ధరల్లో మార్పులు తేనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 15, 2025 నుండి నాన్-FASTag వాహనాలపై అసలు టోల్ ధర కంటే 1.25 రెట్లు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.ఇప్పటి వరకు క్యాష్ ద్వారా టోల్ చెల్లించే వాహనాలపై రెండు రెట్లు టోల్ ఫీజు విధించబడుతోంది. ఇకపై డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు UPI లేదా ఇతర డిజిటల్ పేమెంట్స్ ద్వారా చెల్లించే నాన్-FASTag వాహనాలపై కేవలం 1.25 రెట్లు మాత్రమే టోల్ వసూలు చేయబడుతుంది.ఈ చర్య వల్ల వాహనదారులపై ఆర్థిక భారాన్ని కొంత మేర తగ్గించడంతో పాటు, టోల్ వసూలు ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా మార్చే అవకాశం ఉంది.ఉదాహరణకు, ఒక వాహనం FASTag ద్వారా చెల్లిస్తే టోల్ ఫీజు ₹100 అయితే, అదే వాహనం క్యాష్ ద్వారా చెల్లిస్తే ₹200 చెల్లించాల్సి ఉంటుంది. ఇకపై అదే వాహనం UPI ద్వారా చెల్లిస్తే ₹125 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.ఇకపోతే, 2025లో Mahindra Bolero మరియు Bolero Neo మోడల్స్ కొత్త డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. వీటి ధరలు మరియు ఫీచర్ల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa