బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకటి తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాఘోపుర్ కాగా, మరొకటి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ)కు బలమైన పట్టున్న ఫుల్పరాస్ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.మధుబని జిల్లా పరిధిలోని ఫుల్పరాస్ నియోజకవర్గం 2010 నుంచి జేడీయూకు అడ్డాగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ జేడీయూకు చెందిన శీలా కుమారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి కృపానాథ్ పాఠక్పై సుమారు 11,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. అలాంటి బలమైన స్థానంలో తేజస్వి నేరుగా పోటీకి దిగడం ద్వారా అధికార పార్టీకి గట్టి సవాల్ విసరాలనే వ్యూహంతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ విజయం సాధిస్తే అది ఆర్జేడీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు, జేడీయూకు రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa