ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతికున్న 8 కప్పలను మింగిన 82 ఏళ్ల బామ్మ.. తర్వాత ఏమైందంటే!

international |  Suryaa Desk  | Published : Thu, Oct 09, 2025, 08:05 PM

చైనాలో ఓ 82 ఏళ్ల బామ్మ నడుము నొప్పి తగ్గించుకోవాలని నాటు వైద్యానికి తెగబడి బతికున్న 8 కప్పలను మింగేసింది. తూర్పు చైనాకు చెందిన జాంగ్ అనే ఈ బామ్మ కప్పలు తింటే నొప్పి తగ్గుతుందని నమ్మి రెండు రోజుల్లో వాటిని మింగింది. దీంతో ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి హాంగ్‌జౌ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమె జీర్ణవ్యవస్థలో పరాన్నజీవులు, ఆక్సిఫిల్ కణాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కాగా, రెండు వారాల చికిత్స తర్వాత బామ్మ కోలుకున్నారు. ఇలాంటి నాటు వైద్యం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa