ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవిలో బాలికలపై సామూహిక అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 03:42 PM

ఝార్ఖండ్‌లోని గర్వ్హా జిల్లాలో నవరాత్రి జాతర సమయంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జాతర ముగించుకుని తిరిగి వస్తున్న ముగ్గురు గిరిజన బాలికలను స్కార్పియోలో కిడ్నాప్ చేసి, అడవిలోకి తీసుకెళ్లి నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికల్లో ఒకరిని దారిలోనే వదిలేసి, మిగతా ఇద్దరిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు మండీశ్ యాదవ్, శంకర్ యాదవ్, ఓం ప్రకాశ్ యాదవ్, మరో వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఒకరిని అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa