ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస అంతా అసత్య ప్రచారమే

international |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 05:05 PM

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస జరుగుతోందంటూ వస్తున్న వార్తలను ఆ దేశ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా భారత్ నుంచి ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న 'ఫేక్ న్యూస్' అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. గత వారం అమెరికన్ జర్నలిస్ట్ మెహదీ హసన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."ప్రస్తుతం భారత్‌లో ఫేక్ న్యూస్ ఒక ప్రత్యేకతగా మారిపోయింది. అక్కడి నుంచి తప్పుడు వార్తలు వెల్లువెత్తుతున్నాయి" అని యూనస్ ఆరోపించారు. దేశంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను మతపరమైనవిగా చిత్రీకరిస్తున్నారని, అవి కేవలం భూవివాదాలు వంటి స్థానిక సమస్యల కారణంగా పొరుగువారి మధ్య జరిగే సాధారణ గొడవలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత్ నిరంతరం ఒత్తిడి తెస్తున్నందున తమ ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని ఆయన పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa