ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెలరేగిన కుల్ దీప్ యాదవ్

sports |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 05:11 PM

భారత్– వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు కుల్ దీప్ యాదవ్ ధాటికి విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఢిల్లీ పిచ్ స్పిన్ కు అనుకూలంగా మారడంతో కుల్ దీప్ రెచ్చిపోయాడు. కేవలం 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. దీంతో వెస్టిండీస్ ‘ఫాలో ఆన్‌’లో పడింది. ఓవర్‌నైట్ 140/4 స్కోరుతో ఆట ప్రారంభించిన విండీస్‌.. కుల్‌దీప్‌ యాదవ్ దెబ్బకు కుదేలైంది. మూడోరోజు 248 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ ను 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేయడంతో.. 270 పరుగులు వెనకబడిన విండీస్ ఫాలో ఆన్ ఆడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa