ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నకిలీ మద్యం కేసులో సిట్‌ దర్యాప్తు అనడం వాస్తవాలు బయటకు రాకుండా చేయడం కోసమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 04:11 PM

యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తూ, రాష్ట్ర మంతా సరఫరా చేస్తూ.. పూర్తి ఆధారాలతో సహా తమ పార్టీ నాయకులు పట్టుబడినా, ఇప్పటి వరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు నాయుడు, హఠాత్తుగా ఈ కేసుపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని  కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఆక్షేపించారు. కేవలం నిజాలు సమాధి చేయడానికి, కేసును నీరు గార్చడం కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. గత ఏడాది సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు వేసిన సిట్‌ లన్నీ కేవలం కక్ష సాధింపు కోసం లేదా వాస్తవాలు బయటకు రాకుండా చేయడం కోసమే అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా కుటీర పరిశ్రమల్లా యంత్రాలు పెట్టి, నకిలీ మద్యం తయారు చేస్తూ, దాన్ని రాష్ట్రమంతా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో సహా టీడీపీ నేతలు పట్టుబడ్డారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa