ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ దందా నడుస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 04:16 PM

రాష్ట్రంలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్‌ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అధికార పార్టీ అండదండలతో రాష్ట్రంలో ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ రాకెట్‌ విస్తరించింది అని వైసీపీ నాయకులు వాపోతున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం దందా ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీం పట్నం దాకా పాకింది. ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బెల్ట్‌ షాపుల ద్వారా విక్రయించారని సమాచారం. వాస్తవానికి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్‌ షాపులు ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటిని టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులే దక్కించుకొన్నారు. అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా... రాష్ట్రవ్యాప్తంగా  గ్రామాల్లో 75వేలకు పైగా బెల్ట్‌షాపులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నడుపుతున్నారు అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa