ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ ఆందోళనకి దిగిన టీడీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 06:11 PM

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న డిమాండ్ తో ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సోమవారం నాడు బాలకృష్ణ హిందూపురం పర్యటనకు రాగా... ఆయన కాన్వాయ్‌ను వద్దే అభిమానులు ఈ మేరకు ప్లకార్డులు ప్రదర్శించారు. బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.తన కాన్వాయ్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న అభిమానులను చూసిన బాలకృష్ణ, వారి డిమాండ్లను విన్నారు. అయితే, దీనిపై ఆయన ఎలాంటి హామీ ఇవ్వకుండా, కేవలం నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం బాలకృష్ణ ఎంతో కృషి చేశారని, పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన సేవలను గుర్తించాలని కార్యకర్తలు కోరుతున్నారు. హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రముఖ్ రాజగోపాల్ కూడా ఇదే విషయాన్ని బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లి, మంత్రి పదవి చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. "బాలకృష్ణ లాంటి సీనియర్ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోతే హిందూపురం ప్రజలు తీవ్రంగా నిరాశ చెందుతారు. పార్టీ గెలుపులో ఆయన పాత్ర మరువలేనిది" అని ఒక కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద, బాలకృష్ణకు మంత్రి పదవి అంశం టీడీపీలో అంతర్గతంగా చర్చకు దారితీస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa