ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనత్రయోదశికి బంగారం ఎలా కొంటే ఎక్కువ లాభం

business |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 11:27 PM

ఈ ఏడాది దీపావళికి రెంజు రోజుల ముందు ధంతేరస్ జరుపుకునేందుకు భారతీయులు సిద్ధమవుతున్నారు. కార్తీక మాసంలో దీపావళి ప్రారంభానికి గుర్తుగా ధనత్రయోదశిని జరుపుతారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో ధన్వంతరి భగవానుడు అమృత కలశంతో అవతరించాడని, ధనత్రయోదశి రోజుగా పేర్కొంటారు. ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు ధన త్రయోదశి వస్తోంది. ఈరోజున ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. పసిడి కొంటే మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అయితే ఇప్పుడు పసిడి ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరి బంగారాన్ని డిజిటల్ విధానంలో కొనాలా? లేదా భౌతిక రూపంలో కొంటే మంచి రిటర్న్స్ వస్తాయా? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


భారత్‌లో సాధారణంగా ప్రజలు జువెలరీ రూపంలో భౌతిక బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, బంగారం అనేది చాలా మందికి ఒక పెట్టుబడి మార్గం. దీపావళి, ధంతేరాస్ వంటి పర్వదినాల్లో బంగారం కొంటే మంచిదని భావిస్తారు. ప్రధానంగా బంగారం నగలు, నాణేలు, కడ్డీల రూపంలో కొంటారు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా డిజిటల్ బంగారం పెట్టుబడులు సైతం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. భౌతికంగా బంగారం కొనుగోలు చేయకపోయినా ధరలు పెరిగిన ప్రయోజనాలను డిజిటల్ గోల్డ్ సైతం అందిస్తుంది. అలాగే మేకింగ్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్ ద్వారా రూ.10తోనూ డిజిటల్ గోల్డ్ కొనే ఛాన్స్ ఉంటుంది. డిజిటల్ గోల్డ్ సెక్యూర్డ్ వాల్ట్స్‌లో భద్రపరుస్తారు. దీంతో దొంగతనం జరుగుతుందనే భయం ఉండదు.


అయితే, భౌతిక బంగారానికి ప్రత్యేకత ఉంటుంది. ప్రజలు దీనిని జువెలరీగా ధరిస్తారు. ధరలు పెరిగినప్పుడు దాని విలువ పెరుగుతుంద. అయితే, పెట్టుబడుల విషయానికి వస్తే మాత్రం ఫిజికల్ గోల్డ్ లేదా డిజిటల్ గోల్డ్ ఏది బెటర్? అనే ప్రశ్న ప్రతిఒక్కరిలో తలెత్తుతుంది. ఈ ధన త్రయోదశి, దీపావళికి ఏది కొంటే మంచిదని ఆలోచిస్తుంటారు. మరి కొన్ని అంశాల ద్వారా ఏ బంగారం మంచి రిటర్న్స్ ఇస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


5, 10 సంవత్సరాల్లో ఎందులో ఎక్కువ లాభం?


పెట్టుబడి పెట్టాలనుకునే వారు డిజిటల్ గోల్డ్ లేదా ఫిజికల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీర్ఘకాలంలో చూసుకుంటే ఈ రెండు విధనాల్లో ధరలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అయితే, డిజిటల్ గోల్డ్ కొంచే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే డిజిటల్ గోల్డును భద్రపరిచే ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇందులో ఎలాంటి తయారీ ఖర్చులు ఉండవు. పొర్ట్ ఫోలియోను చాలా సులభంగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఈ 2025లో అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా బంగారంలో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు అందాయి. ఫిజికల్ గోల్డ్ భద్రపరచడం ద్వారా వచ్చే ఖర్చులను ఈ డిజిటల్ గోల్డ్ తగ్గిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa