ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మైనింగ్ లీజులకు సంబంధించి వడ్డెర్లకు 15 శాతం మేర కేటాయించే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. గనుల శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో లభ్యమవువుతున్న ఖనిజాల విలువ గురించి సమగ్ర అధ్యయనం చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే గనుల తవ్వకాలపై ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ వంటి సాంకేతికతల సాయంతో విశ్లేషణలు చేయాలని ఆదేశించారు. వీటితో పాటుగా వడ్డెర్లకు 15 శాతం మేరకు మైనింగ్ లీజులు కేటాయించే విధానం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
మరోవైపు 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా రూ.3320 కోట్లు ఆదాయం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు గనుల శాఖ అధికారులు వివరించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34 శాతం అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే వీలుందని అధికారులు చంద్రబాబుకు వివరించారప. మాంగనీస్ వంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తి ద్వారా మన రాష్ట్రానికి 72 శాతం ఆదాయం వస్తోందని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో మినరల్స్ విలువను అంచనా వేయాలని చంద్రబాబు సూచించారు. అలాగే ఒడిశా వంటి రాష్ట్రాలు అదనపు విలువ జోడించడం ద్వారా అధిక ఆదాయం పొందుతున్నాయన్న చంద్రబాబు.. మన రాష్ట్రంలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఉచిత ఇసుక విధానంపైనా చంద్రబాబు సమీక్ష జరిపారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని ప్రజలు అందరికీ ప్రయోజనం చేకూరాలని అన్నారు. అందుకు తగినట్లుగా ఉచిత ఇసుక సరఫరాను సమర్థంగా అమలు చేయాలని.. ఉచిత ఇసుక విధానం దుర్వినియోగం చేయడానికి లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్నారు. అలాగే ఇసుక లోడింగ్తో పాటుగా ఇసుక రవాణాకు కూడా తక్కువ ఖర్చు అయ్యేలా చూడాలన్నారు. ఉచిత ఇసుక లభ్యతపై తనిఖీలు చేయాలని.. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిని నిఘాను మరింత పటిష్టపరచాలని సూచించారు.
ఇసుక ఉచిత విధానంపై ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షించాలన్నారు. ఈ క్రమంలోనే వడ్డెర్లు, సొసైటీలకు గనులలో 15 శాతం మేరకు రిజర్వేషన్ కల్పించే అంశాన్ని రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వడ్డెర్లకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా మైనింగ్ లీజు కేటాయింపు విధానం రూపొందించాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa