ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్తాన్‌పై వన్ మ్యాన్ షో,,,7 వికెట్లు పడగొట్టిన కేశవ్ మహారాజ్

sports |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 09:14 PM

పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. రావల్పిండి వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో పాకిస్తాన్ బ్యాటర్లు విజృంభించడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. స్పిన్‌కు అనుకూలించిన ఈ పిచ్‌పై కేశవ్ మహారాజ్ ఏడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మొదటి టెస్టుకు దూరమైన కేశవ్.. రెండో టెస్టులో మాత్రం తన సత్తా చాటుకున్నాడు.


రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా తొమ్మిది వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. మార్కో యాన్సన్ ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోతే.. రబడా మాత్రం ఒక వికెట్ దక్కించుకున్నాడు. హార్మర్ రెండు వికెట్లు తీసుకోగా.. కేశవ్ మహారాజ్ ఏడు వికెట్లు పడగొట్టాడు.


తొలి ఇన్నింగ్స్‌లో 42.4 ఓవర్లు బౌలింగ్ చేసిన కేశవ్ మహారాజ్ 102 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఓపెనర్ల వికెట్ల హార్మర్ తీయగా.. మిడిలార్డర్ రిజ్వాన్‌ను రబడా ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. ఇక మిగతా బ్యాటర్లంతా కేశవ్ మహారాజ్‌కి వికెట్లు సమర్పించుకున్నారు.


మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో విజయం సాధించి, మంచి జోష్ మీద ఉన్న పాకిస్తాన్ జట్టు రెండో టెస్టులోనూ అదే హవా కొనసాగించింది. ఓపెనర్ షఫీక్, కెప్టెన్ షాన్ మసూద్ శుభారంభం అందించడంతో భారీ స్కోర్ చేసింది. రెండో రోజు మొదటి సెషన్ సమయానికి పాకిస్తాన్ 333 పరుగులు చేసి ఆలౌట్ అయింది. షఫీక్ 57, ఇమామ్ ఉల్ హక్ 17, కెప్టెన్ షాన్ మసూద్ 87, బాబర్ ఆజామ్ 16, సౌద్ షకీల్ 66, రిజ్వాన్ 19, సల్మాన్ అలీ అఘా 45 పరుగులు చేశారు.


సౌతాఫ్రికా సిరీస్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు టాప్ ప్లేస్ కోసం చూస్తోంది. మొదటి టెస్టు విజయంతో రెండో స్థానంలోకి రాగా.. ఈ టెస్టు కూడా విజయం సాధిస్తే ఆ స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఏడు టెస్టులు ఆడిన భారత్ నాలుగో స్థానంలో ఉండగా, శ్రీలంక మూడో స్థానంలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా ఆఖరి నుంచి రెండు అంటే ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa