బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది అదిరే శుభవార్త. దీపావళి తర్వాత బంగారం ధరలు వరుసగా పడిపోతున్నాయి. మంగళవారం రోజున ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర 4 శాతం మేర పడిపోయింది. దీంతో మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 170 డాలర్లకు పైగా మేర తగ్గి 4170 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 6 శాతం మేర పడిపోయి 49 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఈ ప్రభావం కచ్చితంగా దేశీయ మార్కెట్లలో కనిపిస్తుంది. బంగారం ధరలపై మార్కెట్ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అమెరికా డాలర్ ఇండెక్స్ ఇవాళ 0.3 శాతం మేర పెరిగింది. ఇతర కరెన్సీలు కలిగి ఉన్న వారికి మరిన్ని ఎక్కువ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. అంటే డాలర్ విలువ పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు బంగారంలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని డాలర్ యీల్డ్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య రాజకీయ భౌగోళిక అనిశ్చితులు, ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతుండడంతో పాటుగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేస్తుండడం, పెట్టుబడికి డిమాండ్ ఎక్కువగా ఉండడం సహా అమెరికా వడ్డీ రేట్లను తగ్గించే అంచనాలూ బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో బంగారం ధర ఏకంగా 63 శాతం మేర పెరిగింది.
దీపావళికి ముందు బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. దీంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు దిగివస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తుందన్న అంచనాలూ బంగారం ధరలు పెరిగేందుకు కారణమైంది. అయితే, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇప్పుడు ధరలు వరుసగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. ధరలు తగ్గినప్పటికీ బంగారం ధరలు ఇంకా గరిష్ఠ స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి. అయితే సరికొత్త గరిష్ఠాలను తాకిన ప్రతీసారి ఒక్కసారిగా వెనక్కి తగ్గుతుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్లో ఇలా
ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా మూడో రోజూ ధరలు తగ్గడం గమనార్హం. ఇవాళ దేశీయంగా బంగారం రేటు 24 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.110 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,30,580 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.100 తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,19,700 వద్దకు పడిపోయింది. ఇక వెండి రేటు రూ.8000 మేర పడిపోయింది. దీంతో హైదరాబాద్లో కిలో వెండి రేటు రూ.1,82,000 వద్దకు దిగివచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa