ప్రభుత్వాలు ఉన్నది ప్రజల ప్రాణాలను కాపాడ్డానికే, హరించడానికి కాదు అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అయన మాట్లాడుతూ.... ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి? బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చాం. మత్స్యకార సోదరులతో మాట్లాడి, వారి ఇబ్బందులన్నీ తెలుసుకున్నాం. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటైతే మా కుటుంబాలు నాశనం అయిపోతాయి. మాకు బ్రతుకు తెరువు లేకుండా పోతుంది అని చెబుతూ... ఇవి కేవలం మా ఆవేదన మాత్రమే కాదు, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి అనిత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో మా గ్రామాలకు వచ్చి ఇవే మాటలు చెప్పారు. అదేవిధంగా ఏ ప్రాంతానికైనా పరిశ్రమలు వచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అయితే... ఆ పరిశ్రమలు ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేదిలా ఉండాలి. వారిని ఒప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నదే మా పార్టీ అభిమతం. అలా కాకుండా అధికారం మా చేతుల్లో ఉందన్న మదంతోనో, పోలీసు బలగాలతోనో చేస్తామంటే అది ప్రజాస్వామ్యంలో తగదు. ఆ నేపధ్యంలోనే ఇవాళ బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న ప్రజలు, మత్స్యకారులకు అండగా ఉండేందుకు ఇక్కడికి వచ్చాం. రానున్న రోజుల్లో ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకే ఏ కార్యక్రమమైనా జరగాలి తప్ప..వారి అభీష్టానికి వ్యతిరేకంగా చేసే ఏ కార్యక్రమాన్నైనా మా పార్టీ వ్యతిరేకిస్తుంది. రైతులకు అండగా ఉంటుంది. ప్రభుత్వం రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే... రైతుల పోరాటానికి అవసరమైన మా పార్టీ అధ్యక్షులు వైయస్.జగన్ కూడా వచ్చి వారి అండగా నిలబడతారు అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa