మధ్యప్రదేశ్ కు చెందిన నోటరీ, ప్రైవేటు స్కూలు యజమాని వినోద్ డోంగ్లే తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది. ఆయన డీమ్యాట్ ఖాతాలోని ఓ కంపెనీ షేర్ల విలువ కోట్లకు పెరిగిపోయింది. మొత్తంగా వెయ్యికి పైగా షేర్లు ఉండడంతో ఆయన సంపద ఏకంగా రూ.2,817 కోట్లకు చేరినట్లు చూపించింది. దీంతో తన తలరాత మారిపోయిందని, ప్రపంచంలోని లాటరీలన్నీ ఒకేసారి గెల్చానని భావించినట్లు డోంగ్లే చెప్పారు. అయితే, ఈ ఆనందం కాసేపటికే ఆవిరైపోయింది.అప్పటి వరకు ఒక్కో షేరు రూ.2.14 కోట్లు చొప్పున 1,312 షేర్ల విలువ రూ.2,817 కోట్లుగా చూపించగా.. కాసేపటికే ఆ అంకెలన్నీ మాయమై పాత విలువనే చూపించాయి. ఒక్కో షేరు 63 పైసల చొప్పున రూ.826.56 పైసలుగా చూపించింది. హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో వినోద్ డోంగ్లేకు ఈ విచిత్ర అనుభవం ఎదురైంది. కాసేపే అయినా అంకెల్లో తను బిలియనీర్ ను అయ్యానని వినోద్ డోంగ్లే సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa