భారతదేశపు ప్రతిష్టాత్మక రెడ్ బాల్ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీలో ఓ అరుదైన రికార్డు నమోదయింది. అస్సాం, సర్వీసెస్ మధ్య జరిగిన మ్యాచ్లో డబుల్ హ్యాట్రిక్తో పాటు కేవలం 90 ఓవర్లలోనే ఆట మొత్తం ముగిసింది. దీంతో 63 ఏళ్ల రంజీ రికార్డు బ్రేక్ అయింది. 1962లో ఢిల్లీ - రైల్వేస్ మ్యాచ్ 547 బంతుల్లోనే ముగిసింది.. దాని తర్వాత అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్గా అస్సాం - సర్వీసెస్ మ్యాచ్ చరిత్రలో నిలిచింది.
టిన్సుకియా జిల్లా క్రీడా మైదానంలో జరిగిన అస్సాం - సర్వీసెస్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం జట్టు 17.2 ఓవర్లలో కేవలం 103 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్లో సర్వీసెస్ బౌలర్లు అర్జున్ శర్మ (5/46), మోహిత్ జాంగ్రా (3/5) హ్యాట్రిక్లు సాధించారు. ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు బౌలర్లు హ్యాట్రిక్లు నమోదు చేయడం ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
అయితే, రెండో ఇన్నింగ్స్లో అస్సాం జట్టు రియాన్ పరాగ్ ఆధ్వర్యంలో పునరాగమనం చేసింది. రియాన్ తన కెరీర్లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన (5/25) చూపించి, సర్వీసెస్ జట్టును 108 పరుగులకే ఆలౌట్ చేశాడు. రాహుల్ సింగ్ కూడా నాలుగు వికెట్లు తీయడంతో సర్వీసెస్ కేవలం ఐదు పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ముగించింది.
రెండో ఇన్నింగ్స్లో కూడా అస్సాం బ్యాటర్లు విఫలమయ్యారు. మొత్తం 29.3 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌట్ అయ్యారు. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు అందుకున్నారు. చివరగా సర్వీసెస్ జట్టు 71 పరుగుల టార్గెట్ను కేవలం 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్ మొత్తం 540 బంతుల్లోనే ముగియడంతో ఇది రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యల్ప ఓవర్లలో ముగిసిన మ్యాచ్గా నిలిచింది.
ఇక ప్రపంచ ఫస్ట్క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యల్పంగా ముగిసిన మ్యాచ్ 2004-05 క్వైద్-ఇ-ఆజమ్ ట్రోఫీ (ఫైసలాబాద్ vs కరాచీ బ్లూస్)లో జరిగింది. ఈ మ్యాచ్ అయితే కేవలం 85 బంతుల్లో ముగిసింది. ఇక పూర్తిగా జరిగిన మ్యాచ్లలో 1851లో తస్మానియా -విక్టోరియా మ్యాచ్ 352 బంతుల్లో ముగిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa