ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీచ్‌లోకి ఎవ్వరినీ అనుమతించవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 03:33 PM

మొంథా తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను నేపథ్యంలో అప్రమత్తమైన మంత్రులు, అధికారులు.. ఎలాంటి నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మొంథా తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి.. వెంటనే రంగంలోకి దిగారు. ఆమ్రపాలి రాకతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాలను సందర్శించారు. పునరావాస కేంద్రాల్లో అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఆమ్రపాలికి జాయింట్ కలెక్టర్ నవీన్ వివరించారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని ఈ సందర్భంగా అధికారులకు ఆర్డర్స్ పాస్ చేశారు. ఇక మంగినపూడి బీచ్ లోకి ఎవ్వరినీ వెళ్లనీయవద్దని స్పెషల్ ఆఫీసర్ ఆదేశించారు. ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ను ఆమ్రపాలి సందర్శించారు. బీచ్ వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉండటంతో బీచ్‌లోకి ఎవ్వరినీ అనుమతించవద్దని స్పష్టం చేశారు. పోలీస్, మెరైన్ సిబ్బందితో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ప్రత్యేక అధికారి ఆమ్రపాలి ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa