ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 03:39 PM

తిరుమల పరకామణి చోరీకి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించింది. డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గని అధికారిని ఐవోగా నియమించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పరకామణి కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు, అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తుల పై దర్యాప్తు చేయాలని డైరెక్టర్ జనరల్ ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవికుమార్, కుటుంబ సభ్యుల స్థిర,చర ఆస్తులతో పాటు బ్యాంక్ ఖాతాలను పరిశీలించాలని స్పష్టం చేసింది. వారికి సంబంధించిన ఆస్తులను రిజిస్ట్రేషన్ ద్వారా వేరే వారికి ఏమైనా బదలాయించారా? అనే విషయం పై కూడా దర్యాప్తు చేపట్టి.. నివేదికను తదుపరి విచారణలోగా కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ, సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 2కి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa