ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి ఏఐ మంత్రి గర్భవతి: అల్బేనియా ప్రధాని వింత ప్రకటన

international |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 08:57 PM

ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధస్సు (ఏఐ) మంత్రిని నియమించి చరిత్ర సృష్టించిన అల్బేనియా.. తాజాగా మరో సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. అల్బేనియా ప్రధాన మంత్రి ఎడి రామ బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సమావేశంలో మాట్లాడుతూ.. తమ ఏఐ మంత్రి డియెల్లా త్వరలో 83 మంది పిల్లలకు జన్మను ఇవ్వబోతోందని.. ప్రస్తుతం ఆమె గర్భవతి అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ 83 మంది పిల్లలు.. సోషలిస్ట్ పార్టీకి చెందిన ప్రతి పార్లమెంటు సభ్యుడికి ఒకరి చొప్పున అసిస్టెంట్‌గా పని చేస్తారని అన్నారు. అసలీ వ్యాఖ్యల వెనుక ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఏఐ మంత్రి గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం వెనకున్న ఆంతర్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ ఏడాది సెప్టెంబర్‌లో నియామకమైన ఏఐ ఆధారిత మంత్రిని సాంప్రదాయ అల్బేనియన్ మహిళా దుస్తుల్లో ఉన్న మహిళగా చూపిస్తున్నారు. ఇప్పటికే ఆమెకు డియెల్లాగా నామ కరణం చేసి.. ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు ఆమె గర్భం దాల్చిందని.. ఏకంగా 83 మంది పిల్లలకు ఒకేసారి జన్మను ఇవ్వబోతుందని అల్బేనియా ప్రధాని ఎడి రామ వెల్లడించారు. అయితే వీరంతా నిజమైన పిల్లలు కాదని.. డిజిటల్ పిల్లలు అని చెప్పారు. ఈ 83 మందిని సోషలిస్ట్ పార్టీలోని ఒక్కో పార్లమెంట్ సభ్యుడికి ఒక్కో సహాయకుడిగా నియమించబోతున్నట్లు వివరించారు. ఈ కొత్త AI సహాయకుల ముఖ్య లక్ష్యం.. పార్లమెంటరీ కార్యకలాపాలను పర్యవేక్షించడమేనని కూడా ప్రధాని తెలిపారు.


అంతేకాకుండా చర్చలను రికార్డు చేసి, అవసరమైన సమయాల్లో చట్టసభ సభ్యులు ఏ విధంగా స్పందించాలో కూడా వీరు సూచనలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రతి AI సహాయకుడు పార్లమెంటు సమావేశాలలో పాల్గొని, చర్చల రికార్డును నిర్వహించి, ఏదైనా అంశాన్ని సభ్యులు కోల్పోతే వారికి తెలియజేస్తారని కూడా వివరించారు. "ఈ పిల్లలందరికీ వారి తల్లి (డి


పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను పరిశీలించేందుకు.. అందులో నెలకొన్న అవినీతిని తరిమికొట్టేందుకు డియెల్లాను రూపొందించారు. ఈ క్రమంలోనే ఆ శాఖలో ఉన్న అవినీతిని అంతం చేసేందుకు ఏఐ ఆధారిత డియెల్లాను క్యాబినెట్‌ మంత్రిగా నియమిస్తున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇలా ఒక ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి కాగా.. డియెల్లా పౌరులకు, వ్యాపార సంస్థలకు ప్రభుత్వ పత్రాలను పొందడంలో సహాయం చేస్తోంది.యెల్లా) జ్ఞానం ఉంటుంది" అని రామ స్పష్టం చేశారు. ఉదాహరణకు ఒక ఎంపీ కాఫీ విరామానికి వెళ్లి తిరిగి రావడం ఆలస్యమైతే.. ఈ AI సహాయకుడు వారు హాల్లో లేనప్పుడు దేని గురించి చర్చించారు, మంత్రి దేని గురించి మాట్లాడాలనే విషయాలను చెబుతుందని పేర్కొన్నారు. అయితే ఈ వ్యవస్థ 2026 చివరి నాటికి పూర్తిగా అందుబాటులోకి రావచ్చని చెప్పారు.


పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను పరిశీలించేందుకు.. అందులో నెలకొన్న అవినీతిని తరిమికొట్టేందుకు డియెల్లాను రూపొందించారు. ఈ క్రమంలోనే ఆ శాఖలో ఉన్న అవినీతిని అంతం చేసేందుకు ఏఐ ఆధారిత డియెల్లాను క్యాబినెట్‌ మంత్రిగా నియమిస్తున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఇలా ఒక ఏఐ మంత్రిని నియమించడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి కాగా.. డియెల్లా పౌరులకు, వ్యాపార సంస్థలకు ప్రభుత్వ పత్రాలను పొందడంలో సహాయం చేస్తోంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa