మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తుపానులు ఏర్పడి ఆయా దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. మన దేశంలో మొంథా తుపాను విరుచుకుపడుతుండగా.. అటు అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టిన మెలిసా తుపాను జమైకా ను అతలాకుతలం చేస్తోంది. తుపానుల చరిత్రలోనే అత్యంత శక్తివంతమైనదిగా మెలిసా రికార్డు సృష్టించింది. మంగళవారం జమైకాను తాకిన మెలిసా తుపాను ఆ దేశంలో విధ్వంసం సృష్టించింది. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో వీస్తోన్న పెను గాలల ధాటికి జమైకా ద్వీపంలోని చెట్లు విరుచుకుపడ్డాయి.. కొండ చరియలు విరిగిపడటమే కాక విద్యుత్ స్తంభాలు కూలిపోయి.. దేశంలో సగం జనాభాకు కరెంట్ నిలిచిపోయింది. దీంతో దేశంలో అంతటా అంధకారం అలుముకుంది.
ఇంట్లో కరెంట్ షాక్ రాకుండా ఉండాలంటే కొన్ని వస్తువుల్ని అవాయిడ్ చేయండి, ఏం చేస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు
తుపాను మెలిసా ధాటికి జమైకా రాజధాని నగరమైన కింగ్స్టన్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. మెలిసాను కేటగిరీ 5 తుపానుగా ప్రకటించారు. మెలిసా తుపాను ధాటికి మంగళవారం నాడు పలువురు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత శక్తివంతమైన మెలిసా తుపాను దెబ్బకు జమైకా చరిత్రలో ఎప్పడూ చూడని స్థాయిలో తీవ్ర ఆస్తి నష్టాన్ని చూడబోతుందని ఆ దేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ప్రకటించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తుపాను ఇప్పుడే తీరాన్ని తాకిందని తెలిపారు. ఇప్పుడే దీని పూర్తి స్థాయి తీవ్రతను, నష్టాన్ని అంచనా వేయలేం అని ప్రకటించారు.
తుపాను ధాటికి తీరం వెంబడి 13 ఎత్తుల రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. జమైకాలో తుపానులను నమోదు చేసే విధానం మొదలై 174 సంవత్సరాలు అవుతోంది. ఇన్నెళ్లలో ఇంతటి భీకర తుపాను రావడం ఇదే ప్రథమం అంటున్నారు. తుపాను నేపథ్యంలోసహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. నివేదికల ప్రకారం ఇప్పటి వరకు మెలిసా తుపాను వల్ల హైతీ దేశంలో ముగ్గురు.. డొమినికన్ రిపబ్లిక్ దేశంలో ఒకరు మరణించారని సమాచారం
తుపాను ధాటికి అల్లాడుతున్న జమైకాను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి విభాగాలతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. జమైకాకు ఆహారం, మందులు, నిత్యవసరాలను తరలిస్తున్నాయి. తుపాను నేపథ్యంలో ప్రజలు సురక్షితమైన తాగునీటిని నిల్వ చేసుకోవాలని.. ప్రతి నీటి బొట్టును చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని మంత్రి మాథ్యూ సమూడా ప్రజలకు సూచించారు.
మెలిసా ప్రభావం వల్ల ఇప్పటికే జమైకాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలను నిలిపేశారు. విమానాశ్రయాలు, ప్రజారవాణా నిలిచిపోయింది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో.. సెయింట్ ఎలిజబెత్, కింగ్స్టన్, క్లారెండన్ నగరాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యూబా, బహమాస్, హైతీ, డొమినికన్ రిపబ్లికన్ ప్రాంతాల మీద తుపాను ప్రభావం అధికంగా ఉంది అంటున్నారు.
ఇదిలా ఉంటే.. తుపాన్కు సంబంధించి కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించిన నకిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన తుపాను ప్రభావిత ప్రాంత ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. ఈక్రమంలో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు స్పష్టంచేశారు. జమైకాలో ప్రస్తుతం 25 వేల మంది ఇతర దేశాల పర్యాటకులు ఉన్నారని.. వారిని కాపాడటం కోసం కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa