ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంపై వెలుగులోకి ఆసక్తికర విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 12:07 PM

కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులకు పలు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. వి.కావేరీ ట్రావెల్‌ బస్సు మంటల్లో చిక్కుకున్న సమయంలో రెండో డ్రైవర్‌ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రిస్తున్నట్లు తెలిసింది. చాలా బస్సుల్లో రెండో డ్రైవర్‌ అందులోనే పడుకుంటారని, అత్యవసరమైతే ప్రయాణికులను కూడా ఆ క్యాబిన్‌లోనే తరలిస్తారని వెలుగు చూసింది. పోలీసుల విచారణలో రెండో డ్రైవర్‌ పలు ఆసక్తి విషయాలు వెల్లడించాడు. ప్రమాద సమయంలో తాను కార్గో క్యాబిన్‌లో గాఢనిద్రలో ఉన్నట్లు, భారీ శబ్దం రావడంతో మెలుకువ వచ్చినట్లు చెప్పాడు. ముందుభాగంలో మంటలు చెలరేగిన సమయంలో కంగారుగా డ్రైవర్‌ లక్ష్యయ్య తన వద్దకు వచ్చినట్లు తెలిపాడు. తామిద్దరూ ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదని, బస్సు కుడివైపు అద్దాలు పగులకొట్టి కొంతమంది ప్రయాణికులను బయటకు లాగామని వెల్లడించాడు. ఇతరులతో కలసి తాము చేసిన ప్రయత్నం వల్లే 27మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa