ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదు అని నేను నమ్ముతున్నాను

national |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 04:07 PM

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ భావిస్తున్నట్లుగా నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అయితే, తన నమ్మకాన్ని బలపరిచేందుకు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.తమిళనాడు పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి గురువారం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుడు, నేతాజీకి అత్యంత నమ్మకమైన అనుచరుడైన పసుపొన్ ముత్తురామలింగ దేవర్ చెప్పిన మాటల వల్లే తాను ఈ విషయాన్ని నమ్ముతున్నట్లు వివరించారు. “నేతాజీ ఆ విమాన ప్రమాదంలో మరణించలేదు, నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ నాతో చెప్పారు. అందుకే నేను నమ్ముతున్నాను” అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు.దేవర్ తన జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని, ఆయన తన రాజకీయ ప్రస్థానంలోనూ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారని ఉపరాష్ట్రపతి కొనియాడారు. బుధవారం రాధాకృష్ణన్ రామనాథపురంలో దేవర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఈ పర్యటనలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతలు కూడా ఆయన వెంట ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa