ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు అవార్డ్,,,,మరో ముగ్గురు పోలీసులకు కూడా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య ఘటన జరిగింది. ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన పోలీసుకు కేంద్రం అవార్డ్ ఇచ్చింది. భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్యకు అవార్డు దక్కింది. మృతదేహం డెలివరీ కేసు విషయంలో.. ఆయనతో పాటు మరో ముగ్గురికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. వీరిని సమర్థులుగా కేంద్రం గుర్తించింది. ఎస్పీ నయీమ్, ఏసీబీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, ఎస్సై నజీరుల్లా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు గ్రహీతలను కేంద్రం సన్మానించినట్లు సమాచారం.


భీమవరం డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. ఆయన వ్యవహారశైలిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మికి పవన్ నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ జయసూర్యపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని అస్మికి చెప్పారు. ఆయన పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని.. సివిల్‌ వివాదాల్లో ఆయన జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులూ వస్తున్నాయని చెప్పారు. కొందరి పట్ల పక్షపాతం చూపిస్తున్నారని.. కూటమి నేతల పేర్లు వాడుతున్నారని జయసూర్యపై ఫిర్యాదులు వస్తున్నట్లు ఎస్పీకి వివరించారు.


డీఎస్పీపై వస్తున్న ఫిర్యాదుల గురించి వెంటనే తనకు నివేదిక పంపాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ తరహా వ్యవహారాలను ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలని.. ఎస్పీకి సూచించారు. అనంతరం భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రికి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


సీఎం దాకా వెళ్లిన విషయం..!


పవన్ కళ్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పుడు ఈ సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్‌ కూడా హాజరైనట్లు సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వం డీఎస్పీ జయసూర్యపై విచారణ కూడా విచారణ చేపట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే డీఎస్పీపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపై దర్యాప్తు జరిపి నివేదిక ఇస్తామని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి చెప్పారు.


పవన్ ఎందుకు సీరియస్ అయ్యారు..


కాగా, ఒక డీఎస్పీపై.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకంత సీరియస్ అయ్యారనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే దానికి పలు కారణాలు ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల పేర్లు.. ముఖ్యంగా జనసేన పార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ డీఎస్పీ జయసూర్య అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే పవన్ కళ్యాణ్‌కు ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. కాగా, వైసీపీ హయాంలో జయసూర్య.. గన్నవరం డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత భీమవరం ట్రాన్స్‌ఫర్ అయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa