ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఉపాధ్యాయులను ఉద్దేశించి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, స్కూలు, పాఠ్యాంశాల బోధన.. ఇలా నిత్యం విద్యాబోధనలో నిమగ్నమై ఉండే ఉపాధ్యాయులకు కాస్త ఆటవిడుపుగా ఉండేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎలాగైతే ఆటలపోటీలు నిర్వహిస్తున్నారో.. అలాగే ఉపాధ్యాయులకు కూడా ఆటలపోటీలు నిర్వహిస్తారు. నాలుగు స్థాయిల్లో ఈ పోటీలు జరగనున్నాయి. మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో ఆటల పోటీలు నిర్వహిస్తారు..ఉపాధ్యాయుల ఆటల పోటీలకు సంబంధించిన షెడ్యూల్న ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
ఉపాధ్యాయుల ఆటల పోటీల షెడ్యూల్
నవంబర్ 15-16.. మండల స్థాయి పోటీలు
నవంబర్ 22 -23.. డివిజన్ స్థాయి పోటీలు
నవంబర్ 29-30.. జిల్లా స్థాయి పోటీలు
డిసెంబర్ 6,7,13,14,15.. రాష్ట్ర స్థాయి పోటీలు
ఏమేం పోటీలు ఉంటాయంటే..
ఉపాధ్యాయులకు ఆటల పోటీల నిర్వహణలో భాగంగా.. పురుషులకు క్రికెట్, ఉపాధ్యాయినులకు త్రోబాల్ పోటీలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులలో టీమ్ స్పిరిట్, ఆరోగ్యం , వారి శారీరక దృఢత్వం పెంచేందుకు ఈ ఆటలపోటీలు నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో ఆటలపోటీల నిర్వహణ బాధ్యతలను మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నియమించారు. మరోవైపు మండల స్థాయి జట్ల ఎంపిక బాధ్యతను కమిటీ చేపట్టనుంది. ఇక టీమ్కు సంబంధించి.. క్రికెట్ జట్టులో 16 మంది సభ్యులు ఉంటారు. జట్టులో ఎంఈవో, లాంగ్వేజెస్కు సంబంధించి ముగ్గురు పాఠశాల సహాయకులు, నాన్ లాంగ్వేజులకు సంబంధించిన నలుగురు ఎస్ఏలు, పీఈ, ఏడుగురు ఎస్జీటీలు సభ్యులుగా ఉంటారు.
ఇక త్రోబాల్ జట్టుకు సంబంధించి ఎంఈవో లేదా ప్రధానోపాధ్యాయిరాలు, లాంగ్వేజ్ స్కూలు అసిస్టెంట్లు ఇద్దరు, నాన్ లాంగ్వేజ్ స్కూలు అసిస్టెంట్లు ముగ్గురు. ఎస్ఏ, పీఈటీ, ఎస్జీటీలు ఐదుగురు ఇలా మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa