ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఎంపీ సంజయ్ రౌత్

national |  Suryaa Desk  | Published : Fri, Oct 31, 2025, 07:15 PM

శివసేన (యూబీటీ) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తన మద్దతుదారులకు తెలియజేశారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని, జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. గతంలో ఆయన గొంతు సంబంధిత సమస్యలతో చికిత్స పొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa