అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకువెళ్లింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన 14 మంది అయ్యప్ప స్వాములు వారి కుటుంబ సభ్యులతో అంతర్వేది ఆలయానికి బయలు దేరారు.ఈ సమయంలో ప్రమాదవశాత్తూ బొలెరో వ్యాన్ పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప స్వాములకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి అంబేడ్కర్ కోనసీమ జిల్లా పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి గురైన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగ్రాతులకి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa