ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశీబుగ్గ మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకుంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 05:31 PM

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తొక్కిసలాటలో 8 మంది మహిళలతో పాటు ఒక యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు. ఇది అకారణంగా జరిగిన ఘటన అని చెప్పుకొచ్చారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం తప్పేదని పేర్కొన్నారు. ఆలయ నిర్మాత పాండే ఓ మంచి ఉద్దేశ్యంతో ఆలయం నిర్మించారని గుర్తు చేశారు. కానీ ఆలయ నిర్మాణంలో సాంకేతిక సలహాలు తీసుకోలేదని వివరించారు. కాశీబుగ్గ మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు. 7 అడుగుల ఎత్తునుంచి పక్కనున్న రెయిలింగ్‌పై ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారని చెప్పారు. సీఎం చంద్రబాబు ఘటనపై వెంటనే మంత్రులును, అధికారులను అలర్ట్ చేశారని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై కలెక్టర్ ఇప్పటికే విచారణ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలో ఘటనకు సంబంధించి నివేదికను వెల్లడిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa