భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా భారతీయ మహిళలు.. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయాల్లో బంగారు ఆభరణాల్ని భారీగా కొనుగోలు చేసి ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ సమయాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బంగారం అనేది కేవలం అలంకరణగానే కాకుండా.. ఇంకా పెట్టుబడి సాధనంగానూ పనిచేస్తుంది. మహిళలకు బంగారు ఆభరణాలు మరింత అందాన్ని పెంచుతాయని చెప్పొచ్చు. బంగారం ధర ఇటీవల.. అంతర్జాతీయ అనిశ్చితి, పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా దిగుమతి సుంకాల్ని విధించడం సహా ఇతర కారణాల నేపథ్యంలో విపరీతంగా పెరిగాయి. దీంతో ఇక్కడ భౌతికంగా కొనుగోలు చేసే వారికి చుక్కలు కనిపించాయి. దీనికి భిన్నంగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి మాత్రం కాసుల పంట పండింది.
అయితే.. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరిన గోల్డ్ రేటు అక్కడి నుంచి భారీగా పతనంఅవుతూ వచ్చింది. ఇటీవల 22 క్యారెట్ల పసిడి ధర తులం రూ. 1.21 లక్షలు, 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 1.30 లక్షల మార్కును దాటగా.. అక్కడి నుంచి మళ్లీ వరుసగా తగ్గుతూ వచ్చింది. ఇక్కడ ప్రధానంగా.. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కూడా కాస్త తగ్గుముఖం పట్టడం వంటివి కారణాలుగా ఉన్నాయి. కేంద్ర బ్యాంకులు కూడా బంగారం కొనుగోళ్లను కాస్త తగ్గించాయి. ఇదే సమయంలో యూఎస్ డాలర్ విపరీతంగా పెరగడం.. బంగారం ధర తగ్గేందుకు కారణంగా నిలిచింది.
ఇవాళ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3,970 డాలర్ల వద్ద ఉంది. సిల్వర్ రేటు చూస్తే 47.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 88.70 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ. 11,135 కి చేరింది. కిందటి రోజుతో చూస్తే రూ. 900 పతనమైంది.
ఇక ప్రముఖ జువెల్లరీల్లో గోల్డ్ రేట్ల గురించి చూద్దాం. ఇది అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు. స్థానిక పన్ను రేట్లు సహా షిప్పింగ్ కాస్ట్స్, ఇతర ఛార్జీలు బంగారం ధరల్లో తేడాను చూయిస్తుంది. అయితే.. ఈ ధర ఎలా ఉన్నప్పటికీ.. అదనంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు 3 శాతం జీఎస్టీ పడుతుంది. ఇంకా.. మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. దీనిపైనా మళ్లీ 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఇలా చివరకు ధర ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఛార్జీల్ని మినహాయిస్తే ప్రస్తుతం ఖజానాలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు రూ. 11,135 గా ఉంది. తనిష్క్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు కాస్త ఎక్కువగా ఉంది. ఇది ప్రస్తుతం రూ. 1,11,75 గా ఉంది. కళ్యాణ్ జువెల్లర్స్, జోయాలుక్కాస్, లలితా జువెల్లరీల్లో కూడా బంగారం ధర గ్రాముకు రూ. 11,135 గా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa