ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐ సాయంతో తిరుమలలో సులభతరం కానున్న దర్శనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 06, 2025, 05:31 PM

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ సాయంతో స్వామివారి దర్శనాన్ని కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే విజయవంతమైందని, త్వరలోనే ఈ విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని దళిత వాడల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా 5 వేలకు పైగా వాడల్లో ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.తిరుమల కొండ కింద సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మంది భక్తులకు వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించే ఆలోచనలో ఉన్నామని బీఆర్ నాయుడు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa