నవంబర్ 27న జరగనున్న డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ను విడుదల చేశాయి. డబ్ల్యూపీఎల్ ప్రారంభమయ్యాక జరుగుతున్న తొలి మెగా వేలం ఇదే. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం.. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. దీంతో చాలా ఫ్రాంఛైజీలు టాప్-5 ఆటగాళ్లపై ఫోకస్ చేశాయి. అయితే పర్స్తో పాటు డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం కొందరు ప్రధాన ఆటగాళ్లను మాత్రం రిటైన్ చేసుకోలేకపోయాయి. ఇందులో మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన దీప్తి శర్మ .. లీడింగ్ రన్ స్కోరర్ లౌరా వోల్వార్ట్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఫ్రాంఛైజీలు వదిలేసిన టాప్ ఆటగాళ్లు వీరే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎలీసా పెర్రీ, శ్రేయాంక పాటిల్ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. కానీ రెండో సీజన్లో టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన రేణుకా సింగ్, సోఫీ డివైన్, సోఫీ మొలెనిక్స్, డ్యానీ వ్యాట్ హాడ్జ్లను వదిలేసింది.
ముంబై ఇండియన్స్..
నాట్ సీవియర్ బ్రంట్, హర్మన్ ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, అమన్జోత్ కౌర్, కమలినిని ముంబై రిటైన్ చేసుకుంది. అమెలియా కేర్, డి క్లెర్క్, యస్తికా భాటియా, క్లోన్ ట్రైన్, షబ్నిమ్ ఇస్మాయిల్లను వేలంలోకి వదిలేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్..
జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, అన్నాబెల్ సదర్లాండ్, మారిజాన్నే కాప్, నికీ ప్రసాద్లను ఢిల్లీ అట్టిపెట్టుకుంది. మెగ్ లానింగ్, శ్రీ చరణి, రాధ యాదవ్, అరుంధతి రెడ్డిలను రిటైన్ చేసుకోలేకపోయింది.
గుజరాత్ జెయింట్స్..
ఆశ్ గార్డ్నర్, బెత్ మూనీలను మాత్రమే గుజరాత్ రిటైన్ చేసుకుంది. హర్లీన్ డియోల్, డియేంద్ర డాటిన్, లౌరా వోల్వార్ట్, లీచ్ఫీల్డ్ వేలంలోకి వదిలేసింది.
యూపీ వారియర్స్..
శ్వేత సెహ్రావత్ను మాత్రమే యూపీ రిటైన్ చేసుకుంది. దీప్తి శర్మ, అలీసా హీలీ, సోఫీ ఎక్సెల్టన్, తాహియా మెక్ గ్రాత్, అలానా కింగ్, క్రాంతి గౌడ్ చిన్నెల్లీ హెన్రీని వేలంలోకి వదిలేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa