బిహార్లో జరిగిన తొలి దశ ఎన్నికల అనంతరం ఎల్పీజీ (LJP) ఎంపీ శాంభవి చౌదరి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ఓటు వేసిన వెంటనే మీడియాతో మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఆ వీడియోలో శాంభవి చౌదరి ముందు కుడి చేతి వేలు చూపిస్తూ, తరువాత ఎడమ చేతి వేలు చూపిన దృశ్యం కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు "'రెండు సార్లు ఓటు వేసిందా?'" అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెకన్లకే పరిమితం అయిన ఈ వీడియో, ఎన్నికల పారదర్శకతపై పెద్ద చర్చకు దారితీసింది.కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటనను తీవ్రంగా విమర్శించింది. అధికార పార్టీ మిత్రపక్ష నేతలు ఇలాంటి చర్యలు చేస్తే, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. 'ఓటు చోరీ' అంటూ, కాంగ్రెస్ సోషల్ మీడియా పేజీలో శాంభవి చౌదరి ఫోటోను షేర్ చేసి, బిహార్ ఎన్నికల్లో NDA న్యాయబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తింది. కొంతమంది నెటిజన్లు కూడా ఆమె రెండు వేలు చూపడం డబుల్ ఓటింగ్ సంకేతమా? అని ప్రశ్నిస్తున్నారు.అయితే, ఆమె శిబిరం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. ఇది కేవలం తప్పుగా అర్థం చేసుకున్న సంఘటన మాత్రమేని, ఎడమ చేతిపై ఉన్న ఇంక్ పాతదని వారు వివరించారు.మరోవైపు, కొన్ని అధికారులు మరియు ఎన్నికల పరిశీలకులు ఈ ఘటన పెద్ద సమస్య కాదని వ్యాఖ్యానిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో కొన్నిసార్లు ఇంక్ డబుల్ మార్క్ అవ్వడం లేదా తప్పుగా చేతి వేలు గుర్తించడం సాధారణమేనని చెప్పారు.అయితే, వీడియో వైరల్ కావడంతో ఎన్నికల కమిషన్ ప్రాథమిక విచారణ చేపట్టే అవకాశముంది. ఈ సంఘటన బిహార్ ఎన్నికల వేడిని మరింత పెంచింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రమని ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నప్పటికీ, ఇలాంటి ఘటనలు పారదర్శకతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa