టీడీపీకి అండగా నిలిచిన కురుబ సోదరులను ఎప్పటికీ మరువబోమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. భక్త కనకదాస 538వ జయంతిని పురస్కరించుకుని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లోకేశ్ ప్రసంగించారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజని అన్నారు.టీడీపీ హయాంలోనే కురుబ సామాజిక వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్య్రం వచ్చిందని లోకేశ్ అన్నారు. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎస్.రామచంద్ర రెడ్డి, బీకే పార్ధసారధి, నేటి మంత్రులు సవిత, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు వంటి ఎందరో కురుబ నేతలను టీడీపీ ప్రోత్సహించిందని వివరించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి పాలన చూశామని, బీసీలపై దాడులు జరిగాయని విమర్శించారు. అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి 94 శాతం సీట్లతో చారిత్రక విజయాన్ని అందించారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa