ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాద ఘటనపై భాద్యులని అరెస్ట్ చెయ్యకుండా, ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 02:29 PM

రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన ఎమర్జెన్సీ పరిస్థితిని తలపిస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తే నోటీసు, రోడ్డుపైకొచ్చి గొంతెత్తితే అక్రమ కేసులు పెడుతూ పౌరుల హక్కులను కాల రాస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు అచ్చం నియంతలా వ్యవహరిస్తున్నారని వారు ఫైర్‌ అయ్యారు. నియంతలంతా దారుణంగా తమ చరిత్ర ముగించారన్న వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, వారికి పట్టిన గతే భవిష్యత్తులో చంద్రబాబుకూ పడుతుందని తేల్చి చెప్పారు. కర్నూలు బస్సు ప్రమదంలో ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని కర్నూలులో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది అమాయకులు చనిపోతే బాధ్యతగా దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వం, ఘటనను ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు పెట్టిందని వారు ఆక్షేపించారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు లక్ష్మీపురంలో బెల్ట్‌ షాపే లేదని ప్రభుత్వం పచ్చి అబద్ధం చెబుతోందని, తనతో వస్తే లక్ష్మీపురంలో బెల్ట్‌ షాపు చూపడానికి సిద్దంగా ఉన్నానని, అది నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, మరి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నదా అని ఎస్వీ మోహన్‌రెడ్డి సవాల్‌ చేశారు. కూటమి నాయకుల మెప్పు కోసం చట్టవిరుద్ధంగా వ్యవహరించే పోలీసులు రేపు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తగిన మూల్యం  చెల్లించుకోక తప్పదని మనోహర్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa