ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చదువులో వెనకబడ్డారని ఆశ్రమ పాఠశాలనుండి పారిపోయిన ఇద్దరు బాలికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 03:53 PM

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న జరిగిన ఒక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..జిల్లాలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పెదబయలు ఆశ్రమ బాలికల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఐదు, ఆరో తరగతి చదువుతున్న ఈ బాలికలు చదువులో వెనకబడ్డారు. దీంతో ఈ నెల 6న వీరిద్దరూ సమీపంలోని అడవిలోకి పారిపోయారు. కారడవిలో దుంపలు తింటూ వాగులో నీరు తాగుతూ నాలుగు రోజుల పాటు గుహలో దాక్కున్నారు. బాలికలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పాఠశాల సిబ్బంది.. చుట్టుపక్కల వెదికారు.బాలికల ఆచూకీ దొరకకపోవడంతో ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి బాలికల కోసం గాలింపు చేపట్టారు. సోమవారం డ్రోన్ల సహాయంతో గాలింపు చేపట్టగా కొంచూరు కొండల్లోని గుహలో వీరు తలదాచుకున్నట్లు గుర్తించారు. వెంటనే గ్రామస్థుల సహకారంతో ఇద్దరినీ పట్టుకుని సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. చదువులో వెనకబడ్డామనే బెంగతోనే అడవిలోకి పారిపోయినట్లు బాలికలు చెప్పారని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa