ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12కి చేరిన ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 03:52 PM

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నెమ్మదిగా వెళుతున్న కారులో సోమవారం సాయంత్రం శక్తివంతమైన పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సోమవారం రాత్రి వరకు 9 మంది మరణించగా, 20 మంది గాయపడినట్లు అధికారులు ధ్రువీకరించారు. తాజాగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 12కి పెరిగింది.ఈ దారుణ ఘటనపై ఢిల్లీ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa