ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత మాదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 04:20 PM

యువత మంచి ఆలోచనలతో ముందుకు వస్తే, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 175 నియోజకవర్గాల్లో ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి, లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామని ఆయన ప్రకటించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును మంగళవారం ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. "ఈ రోజు 99 కంపెనీలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. వీటి ద్వారా రూ.2.65 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. జనవరి నాటికి మరో 70 ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభిస్తాం. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే మా లక్ష్యం" అని సీఎం వివరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa