ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత ఐటీ కంపెనీలకు మంచి రోజులు.. కీలక రిపోర్ట్

business |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 11:07 PM

భారత ఐటీ రంగంలో మంచి రోజులొచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2026 రెండో అర్ధభాగంలో భారతీ ఐటీ కంపెనీలు మెరుగైనా ఫలితాలను నమోదు చేయవచ్చని సెంట్రమ్ రీసర్చ్ నివేదిక అంచనా వేసింది. ఇందులు ప్రధాన కారణం ఏఐ ఆధారిత ప్రాజెక్టులు , మెరుగైన క్లయింట్ భాగస్వామ్యంతో పాటు విచక్షణా వ్యయంలో పెరుగుదల అని తెలిపింది. దీంతో ఇన్నాళ్లు ప్రపంచ వాణిజ్య అనిశ్చితులతో సతమతమవుతున్న కంపెనీలకు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత కంపెనీలు మెరుగైన ఫలితాలు అందుకోవచ్చనే నివేదిక విడుదలైంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.


ఈ ఆర్థిక సంవత్సరం 2026 రెండో అర్ధభాగంలో మెరుగైన డీల్స్ వృద్ధిని పెంచే అవకాశం ఉందని నివేదిక నొక్కి చెప్పింది. భారత ఐటీ కంపెనీల వ్యాపారం రెండో అర్ధభాగంలో వేగం పుంజుకోనుందని తెలిపింది. అందుకు పెద్ద క్లయింట్లతో భాగస్వామ్యాలు, ఏఐ-ఫస్ట్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. ' ఏఐ ఆధారిత ప్రాజెక్టులు, క్లయింట్ ఎంగేజ్మెంట్‌లో మెరుగుదల, విచక్షణా వ్యయాల ప్రక్రియలో మెరుగుదల వంటి కారణంలతో భారత ఐటీ కంపెనీల వ్యాపారం ఈ ఆర్థిక ఏడాది రెండో అర్ధభాగంలో మెరుగైన ఫలితాలు అందుకోనుంది' అని తన నివేదికలో సెంట్రమ్ రీసర్చ్ పేర్కొంది.


 భారత ఐటీ కంపెనీలు రికవరీ అయ్యేందుకు ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్లు దోహదం చేస్తాయని నివేదిక తెలిపింది. బలమైన ఒప్పంద పైప్‌లైన్, స్కేలబుల్ ఆధునీకరణ కార్యక్రమాల మద్దతుతో ఐటీ కంపెనీలు వేగంగా రికవరీ అవుతాయని నివేదిక తెలిపింది. అయితే, రిటైల్, ఆటోమోటివ్ సెగ్మెంట్లు ఇప్పటికీ వివిధ కారణాలతో ఒత్తడిలోనే ఉంటాయని పేర్కొంది. క్లౌడ్, డేటా, ఏఐలలో పెట్టుబడులు మధ్యస్థ డిమాండ్ పునరుద్ధరణకు దారితీస్తాయని తెలిపింది. ఐటీ సేవలలో స్థిరమైన వృద్ధిని నిర్ధారిస్తాయని, ఈ మార్పు కోసం క్లయింట్ల భాగస్వామ్యం బలంగా ఉందని నివేదిక పేర్కొంది.


ఉద్యోగుల నిర్వహణ కూడా స్థిరంగా ఉందని రిపోర్ట్ తెలిపింది. తక్కువ అట్రిషన్ స్థాయిలు, నియామక వ్యూహాలు ఒప్పందాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొంది. లాభదాయకతను కాపాడటానికి ఐటి సంస్థలు ఖర్చు నియంత్రణ, ఆటోమేషన్, ఉద్యోగుల నిర్మాణాలను ఆప్టిమైజ్ చేయడంపై దృష్టి సారించడం కొనసాగించినట్లు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa