ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు విశాఖలో పర్యటించనున్న లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 03:30 PM

ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం చేరుకున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు విశాఖ విమానాశ్రయంలో కూటమి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.విమానాశ్రయం నుంచి మంత్రి లోకేశ్ నేరుగా నోవాటెల్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ఒక కీలక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రముఖ ఇంధన సంస్థ 'రెన్యూ పవర్'తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకోనున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం లోకేశ్ విశాఖ ఐటీ హిల్స్‌లో పర్యటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa