ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లోబల్ వార్మింగ్ ని అరికట్టాలంటే గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 13, 2025, 03:29 PM

భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. సుస్థిరాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ ప్రాముఖ్యతపై కీలక ప్రసంగం చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ను 'గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ'గా తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరిగిపోవడం వల్ల ప్రకృతి విపత్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "క్లౌడ్ బరస్ట్ వంటి ఘటనలతో నగరాలు నీట మునుగుతున్నాయి. ఒకేచోట 40 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వంటి తీవ్ర పరిణామాలు గ్లోబల్ వార్మింగ్ వల్లే సంభవిస్తున్నాయి. ఈ ఉత్పాతాలను ఎదుర్కోవాలంటే మనమంతా కలిసి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయాలి" అని పిలుపునిచ్చారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సౌర, పవన, పంప్డ్ ఎనర్జీ రంగాల్లో చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రానున్న డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భారత్, ఈయూ మరింత సమర్థంగా కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa