ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో మేనేజ్ మెంట్ ఇన్‌స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్: 2000 ఉద్యోగాలు సృష్టి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 16, 2025, 10:08 PM

ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (APEDC) మరియు సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ మధ్య 2025 నవంబర్ 14-15 తేదీల్లో జరిగిన భాగస్వామ్య సదస్సు సందర్భంగా ఒక ముఖ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.ఒప్పందం ప్రకారం, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ సంస్థ విశాఖపట్నం నగరంలో రూ. 150 కోట్లకు పైగా పెట్టుబడితో ఒక మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ హోటల్ ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అంచనా వేయబడింది.ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి ప్రాజెక్ట్ అభివృద్ధికి అవసరమైన అనుమతులు, అధికృత పత్రాలు మరియు క్లియరెన్స్‌లను సంబంధిత శాఖల నుంచి వేగంగా పొందడంలో సంస్థకు సహకరిస్తుంది. ఈ అవగాహన ఒప్పందం 3 సంవత్సరాల కాలానికి చెల్లుబాటు అవుతుంది.ఒప్పందంపై APEDC తరపున చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సన్ ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్ మెంట్ తరపున ఛైర్మన్ జస్తి శ్రీకాంత్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్ అభివృద్ధిని నిర్ధిష్ట కాల వ్యవధిలో సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa