తిరునెల్వేలి జిల్లాకు చెందిన దేవా విజయ్పై ఓ మహిళ 2024లో అత్యాచారం కేసు దాఖలు చేసింది. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనను 2015 నుంచి 2024 వరకు ఐదు సార్లు శారీరక సంబంధం పెట్టుకోవడానికి మోసం చేశారని ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా, దేవా విజయ్ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ను ఆశ్రయించి కేసును కొట్టివేయాలని కోరాడు.
జస్టిస్ కే.మురళీ శంకర్ ధర్మాధికారిగా ఉన్న సింగిల్ బెంచ్ ఈ పిటిషన్పై విచారణ జరిపింది. బంధం పూర్తిగా ఏకపక్షమైనది కాదని, ఇద్దరి మధ్య సమ్మతితోనే సంబంధం కొనసాగినట్టు కనిపిస్తోందని కోర్టు గమనించింది. 2015లో మొదటి సారి శారీరక సంబంధం జరిగినప్పుడు మహిళ వయసు 26 ఏళ్లు కాగా, ఆ తర్వాత కూడా ఆమె తన సొంత ఇంటికి వచ్చి సంబంధం పెట్టుకున్నారని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది.
పెళ్లి హామీ ఇచ్చి మోసం చేశారనే ఆరోపణకు ఎటువంటి బలమైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. బంధం విఫలమైందని, భావోద్వేగాలు దెబ్బతిన్నాయని కేవలం ఆ ఒక్క కారణంతో అత్యాచారం కేసు పెట్టడం సరైంది కాదని నొక్కి చెప్పింది. ప్రతి విఫలమైన ప్రేమ లేదా సంబంధాన్ని నేరంగా మార్చలేమని కోర్టు వ్యాఖ్యానించింది.
అందుకే దేవా విజయ్పై నమోదైన రేప్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలాంటి కేసుల్లో సమ్మతి, ఉద్దేశం, ఆధారాలను బేరీజు వేసుకోవాలని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa