తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కొత్త సర్వీసుల ప్రారంభంపై రైల్వే అధికారుల స్థాయిలో వేగంగా కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో విజయవాడ–బెంగళూరు వయా తిరుపతి మార్గంలో కొత్త వందేభారత్ రైలు త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ నుంచి ప్రారంభ దశలోనే రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి కోసం సంబంధించిన రూట్లను కూడా ఖరారు చేశారు. రాజధాని, దురంతో రైళ్లకంటే మరింత వేగంతో సాగే ఈ వందేభారత్ స్లీపర్ రైళ్లకు ఇప్పటికే ముహూర్తం కూడా నిర్ణయమైంది.డిమాండ్ అత్యధికంగా ఉన్న రూట్లపై జరిగిన పరిశీలన తర్వాత ఒకటి సికింద్రాబాద్, మరొకటి విజయవాడ నుంచి నడపాలని రైల్వేలు నిర్ణయించాయి. వందేభారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్లు ఉండగా — 11 థర్డ్ ఎసి, 4 సెకండ్ ఎసి, 1 ఫస్ట్ ఎసి కోచ్లుగా రూపకల్పన చేశారు. వేగ పరంగా ఇవి ప్రస్తుత రాజధాని, దురంతో రైళ్లను మించనున్నాయి.సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీకి నడిచే తొలి వందేభారత్ స్లీపర్ మొత్తం 1667 కిలోమీటర్ల దూరాన్ని 20 గంటల లోపు పూర్తి చేయనుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలు ఆగ్రా కాంట్, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్పూర్, బల్హర్షా, కాజీపేట్ వంటి ముఖ్య స్టేషన్లపై ఆగుతూ ప్రయాణించనుంది.
భారాల విషయానికి వస్తే
థర్డ్ ఎసి ఛార్జీ సుమారు ₹3600
సెకండ్ ఎసి ఛార్జీ ₹4800
ఫస్ట్ ఎసి ఛార్జీ సుమారు ₹6000
న్యూఢిల్లీ నుంచి రాత్రి 08:50కి బయలుదేరే ఈ రైలు, మరుసటి రోజు రాత్రి 08:00కి సికింద్రాబాద్ చేరుకునేలా టైమ్టేబుల్ సిద్ధమైంది. ఇదే విధంగా విజయవాడ–బెంగళూరు వందేభారత్ ప్రారంభానికి సంబంధించిన నిర్ణయం కూడా ఫైనల్ దశలో ఉన్నట్లు సమాచారం.ఆంధ్రప్రదేశ్ నుంచి అయోధ్య, వారణాసి మార్గాలకు వందేభారత్ స్లీపర్ కేటాయింపుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. ఇది తొలి విడతలో సాధ్యం కాకపోతే, మార్చిలో ప్రకటించే రెండవ విడతలో ఈ రూట్లకు అవకాశం ఉండేలా రచనలు జరుగుతున్నాయి. రెండు విడతల్లో కూడా ఈ మార్గాలకు అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం – ముహూర్తం ఖరారు!విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రయాణించే ప్రస్తుత మార్గంలోనే వందేభారత్ స్లీపర్ను అయోధ్య రూట్కు కేటాయించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రాత్రి సమయంలో నడిచే సర్వీస్గా దీనిని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇది ప్రారంభమైతే, అయోధ్య–వారణాసి వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలగనుంది.ఈ రెండు రైళ్లకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ వచ్చే వారం విడుదలయ్యే అవకాశం ఉందని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa