భారతదేశం, చైనా మరియు ఇతర ప్రపంచ దేశాలపై అమెరికా పన్నులు విధించడం, షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం వంటి చర్యలతో ఇటీవల భారత్-చైనా సంబంధాలు కొత్త రీతిలో చిగురుతున్నాయి.గల్వాన్ వ్యాలీ ఘర్షణ కారణంగా ఇరు దేశాల మధ్య ఆగిపోయిన సత్సంబంధాలు ఇప్పుడు కొంత మెరుగుపడుతున్నాయి. అయితే, ఈ నేపథ్యంలో అమెరికా ఒక సంచలన రిపోర్టును విడుదల చేసింది. అమెరికా కాంగ్రెషనల్ అడ్వైజరీ బాడీ చైనాపై తీవ్ర ఆరోపణలు చేసిన ఈ నివేదికను తన వార్షిక రిపోర్టులో బహిర్గతం చేసింది.ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో, చైనా పాకిస్థాన్కు ఎలా సహాయం చేసిందో అమెరికా రిపోర్టు బట్టబయలైంది. చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను సృష్టించి, భారత్పై వివాదాస్పద ప్రచారాన్ని నడిపిందని రిపోర్ట్లో పేర్కొన్నారు. ఆపరేషన్ సమయంలో భారత్కు చెందిన రఫేల్ యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయని చూపే AI-తయారుచేసిన చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ చేయబడ్డాయి.నవంబర్ 19న విడుదలైన అమెరికా-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ నివేదికలో, ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా మిస్-ఇన్ఫర్మేషన్ ప్రచారాన్ని ప్రారంభించి, భారత్ డిఫెన్స్ సామర్థ్యాన్ని అంతర్జాతీయంగా బలహీనతకు గురిచేశిందని స్పష్టం చేశారు.అయితే, పాకిస్థాన్ తన ఆయుధాలను చైనాలో కొనుగోలు చేసిందని రిపోర్ట్ పేర్కొంది. చైనా ఆయుధాలను ఆధారంగా చూపి, ఫేక్ ఫోటోలు సృష్టించి, భారత్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాల అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా తన ఆయుధాల దాటిలో నాశనం అయ్యాయని ప్రదర్శించడం ద్వారా, అంతర్జాతీయ మార్కెట్లో తన ఆయుధాలను విక్రయించడానికి ప్రయత్నించిందని అమెరికా కమిషన్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa