ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమను పారిశ్రామిక హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 06:12 AM

రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, అన్నదాతకు అండగా నిలిచేందుకు తమ ప్రభుత్వం పటిష్టమైన పంచసూత్ర ప్రణాళికతో ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఐటీ నిపుణులకు ఎంతటి కీర్తిప్రతిష్ఠలు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా అదే స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.7 వేల చొప్పున మొత్తం రూ.3,135 కోట్లను జమ చేశారు. అనంతరం ‘రచ్చబండ’ కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ “రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు విడుదల చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో తొలి విడతగా రూ.3,175 కోట్లు జమ చేశాం. ఇప్పుడు రెండో విడతతో కలిపి మొత్తం రూ.6,310 కోట్లను అన్నదాతలకు అందించాం. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా విధ్వంసానికి గురైంది. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రైతు సంక్షేమంపై మా చిత్తశుద్ధికి ఈ నిధుల విడుదలే నిదర్శనం” అని చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa